Thursday, 19 May 2022

పాండవుల గుట్టలు..

 అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాండవుల గుట్టలు..




వెంకటేశ్వర్లపల్లి/తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివార్లలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పాండవుల గుట్టలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. దీంతో, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, పర్యావణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, మేధావులు, రచయితలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రాచీన కాలంలో ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లిందని, బౌద్ధుల ధ్యాన కేంద్రంగా పాండవుల గుట్టలకు ఒక ప్రత్యేకత ఉందని చరిత్రకారులు చెపుతున్నారు.

అంతేగాక, పాండవుల గుట్టలని రాతి చిత్రాల విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటారు. ఇటీవలే పాండవుల గుట్టలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. పాండవుల గుట్టలను పర్యాటక ప్రదేశంగా మరింత అభివృద్ది చేసేలా కృషి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, పాండవుల గుట్టలను యునెస్కో కు ప్రతిపాదించి, వారసత్వ హోదా దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతటి ప్రాధాన్యత పొందిన పాండవుల గుట్టల్లో ఈమధ్యకాలంలో కొంతమంది వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని రెచ్చిపోతున్నారు. ప్రతి ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తారు. పెద్ద ఎత్తున పాండవుల గుట్టల్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. దీంతో, జిల్లాల్లో చర్చానియంశంగా మారింది. పాండవుల గుట్ట ప్రతిష్ఠతకు భంగం వాటిల్లుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని పరిసర ప్రాంతవాసులు కోరుకుంటున్నారు.

1 comment:

  1. రేగొండ పోలీసులు దృష్టి పెట్టాలి.
    ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా చూడాలి

    ReplyDelete

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...