ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఈ మధ్య ఎస్బిఐ ఖాతాదారులకు మీరు కేవైసీ సబ్మిట్ చేయకపోతే మీ అకౌంట్లను బ్లాక్ చేస్తామని వస్తున్న మెసేజ్ లపై కేంద్రం అలర్ట్ అయింది. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్బిఐ ఖాతాదారుల్ని టార్గెట్ చేశారు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఫోన్ కాల్స్, మెసేజ్, ఈ మెయిల్స్ కు రిప్లై ఇవ్వద్దని కేంద్రం సూచించింది. ఎస్బిఐ ఖాతాదారులు ఇలాంటి మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇటువంటి మెసేజ్ లపై ఎటువంటి అనుమానం వచ్చినా బ్యాంకు అధికారులు సంప్రదించాలని ట్విట్టర్లో వెల్లడించింది.


No comments:
Post a Comment