బిజీబిజీగా మోదీ జపాన్ టూర్..
- ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం..
- భారత్, జపాన్ సహజ భాగస్వాములన్న మోదీ..
- క్వాడ్ సమావేశంలో పాల్గొననున్న పీఎం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
-జపాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. తొలిరోజు టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధిలో జపాన్ దేశస్థుల పెట్టుబడులు కీలక పాత్ర ఉందన్నారు. ప్రపంచ దేశాలు బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు. సవాల్గా ఉన్నా హింస, అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల నుంచి మానవాళిని అదే కాపాడుతుందని తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా భారత్ ఇట్టే పరిష్కారం చూపుతుందన్నారు. కోవిడ్ సమయంలో ఇదే రుజువయ్యిందని స్పష్టం చేశారు. తాను జపాన్కు వచ్చిన ప్రతిసారి మంచి ఆదరణ దక్కుతోందన్నారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులు తనపై చూపుతున్న ఆదరణ మరవలేనిదన్నారు. జపాన్లో స్థిరపడినా, భారతీయ సంస్కృతిని కొనసాగిస్తున్నారని, ఇందుకు అందర్నీ అభినందిస్తున్నానని చెప్పారు.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు మిన్నంటాయి. జపాన్ టూర్లో క్వాడ్ కూటమి సదస్సులో ఆయన పాల్గొనననున్నారు. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు పాల్గొంటాయి. జపాన్ ప్రధాని కిషద, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.


జై బిజెపి
ReplyDelete