Friday, 20 May 2022

శ్రీలంక సంక్షోభం..

 తీవ్ర సంక్షోభంతో అల్లాడిపోతున్న లంకేయులు

పాఠశాలలు, కార్యాలయాలు బంద్..
పెట్రోలు డబ్బాలతో బంకుల వద్ద పడిగాపులు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
శ్రీలంకలో రోజు రోజుకు పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతున్నాయి. తాజాగా అక్కడి పాఠశాలన్నింటినీ మూసి వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రావద్దని సూచించారు. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్రమైన ఇంధన కొరత కొనసాగుతోంది. పెట్రోలు డబ్బాలతో బంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పెట్రోల్ తో పాటు ఇతర ఇంధనాల కొరత లంక ప్రజలను వేధిస్తోంది. రోజుల తరబడి పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న సందర్భంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇంధన దిగుమతికి డాలర్లు లేకపోవడంతో అంతర్జాతీయ సంస్థలు విదేశాల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
ఇదిలావుండగా,  సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక లో నూతనంగా 9 మంది మంత్రులను నియమించారు. లంకలో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు జరిగే వరకు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి కొలంబో లోని గాలే ఫేస్ గ్రీన్ లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నిరసనల్లో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోగా,  మరో 250 మందికి పైగా గాయల పాలయ్యారు.

కాగా, శ్రీలంక 70ఏళ్ల  చరిత్రలో మొట్టమొదటి సారిగా రుణాలను ఎగవేసింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక దేశం చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా గడువు తీరడంతో ఎగవేసినట్లు తేలిపోయింది. ఇట్టి విషయాన్ని క్రెడిట్ ఏజెన్సీలు అధికారికంగా ధ్రువీకరించాయి. ఇప్పటికే కొవిడ్ కారణంగా లంక ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం కొరత ద్రవ్యోల్బణం లో పెరుగుదల కారణంగా ఔషధాలతో పాటు తీవ్ర ఇంధన కొరత కూడా ఏర్పడింది.


2 comments:

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...