ఖాజీపేటలో లోకో పైలట్ల కుటుంబ సభ్యుల ధర్నా..
తెలంగాణ:
ఖాజీపేటలో గత ఐదు రోజుల నుండి రైల్వే లోకో పైలట్లు నిర్వహిస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాలు ఉదృత రూపు దాల్చుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు లోకో పైలట్లు కుటుంబ సభ్యులతో సహా కలిసి క్రూలాబీ ముందు నిరసన ప్రదర్శనను చేపట్టారు. ఈ మధ్యకాలంలో కాజీపేట నుండి ఆపరేట్ చేయబడుతున్న కోచింగ్ లింకులను ఒక్కొక్కటిగా విజయవాడకు తరలించడంతో కార్మికుల్లో అసహనం నెలకొని ఈ నిరసనలకు దిగినారు. ఈ నిరసనలో లోకో పైలట్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ వారిని ఇక్కడి నుండి వేరే చోట్లకు బదిలీ చేసి కుటుంబ సభ్యులను వేదనలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment