Thursday, 27 October 2022

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు దావత్..

 ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు దావత్..



తెలంగాణ:

హన్మకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చేసుకోవడం ప్రస్తుతం అంతా చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌రూమ్‌లో బీర్లు తాగుతూ కొంతమంది మహిళా సిబ్బంది హల్ చల్ చేశారు. చికిత్స కొరకు ఆసుపత్రికి వచ్చిన రోగులను గాలికి వదిలేసి ఎంచక్కా బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. మందుపార్టీలో ఒక ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, మరొక జీఎన్‌ఎమ్ ఉన్నారు. కాగా,  సిబ్బంది వెకిలి చేష్టలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

1 comment:

  1. మందు బాబులు పొరపాటున వైన్ షాప్ కి బదులు ఆసుపత్రికి వచ్చేస్తారు

    ReplyDelete

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...