Monday, 23 May 2022

ముందే ముగిసిన సీఎం ఢిల్లీ టూర్..


ముందే ముగిసిన సీఎం ఢిల్లీ టూర్..



షెడ్యూల్ కన్నా ముందే హైదరాబాద్ కు సీఎం కేసీఆర్..

షెడ్యూల్ ప్రకారం సీఎం ఈ 25వరకు ఢిల్లీలోనే..

హఠాత్తుగా హైదరాబాద్ రాకపై రాజకీయ వర్గాల్లో చర్చలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


వారం రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్కు బయలుదేరారు. ఈ నెల 25 వరకు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండాలి. కానీ, అనూహ్యంగా హైదరాబాద్ కు ఈ సాయంత్రం తిరుగు పయనమయ్యారు. బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా వాటిని రద్దు చేసుకుని షెడ్యూల్‌ కన్నా ముందే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగిరావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని, ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంపై వివక్ష వీడి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కేంద్రం పరిధిలోకి రాకుండా చూడాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలో ఉండాల్సింది. పలు జాతీయ పార్టీల నేతలు, జాతీయ మీడియాకు సంబంధించిన వారితో భేటీ అవుతారని సీఎం కార్యాలయం ప్రకటించింది.

1 comment:

  1. మోదీ భయం పట్టుకుంది సీఎం కు

    ReplyDelete

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...