బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్..
- డబ్బాలు, క్యాన్లు పట్టుకొని పరుగెత్తిన జనం..
- భారీగా ట్రాఫిక్ జామ్..
- అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ఘటన..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్గార్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. డబ్బాలు, క్యాన్లు, బిందెలతో అక్కడికి చేరుకుని వంట నూనె కోసం పోటీ పడ్డారు. క్రమంలోనే అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను నిలువరించే ప్రయత్నం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడ్డ ట్యాంకర్ లో 12 వేల లీటర్ల వంటనూనె ఉందని, దాన్ని సూరత్ నుండి ముంబైకి తరలిస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
No comments:
Post a Comment