Thursday, 26 May 2022

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..

 రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. 



కల్వర్టును ఢీకొని కింద పడ్డ కారు..

ఏపీ లోని అన్నమయ్య జిల్లాలో ఘటన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

వివరాల్లోకెళితే.. మదనపల్లి వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. మదనపల్లి మండలంలోని పుంగనూరు వద్ద ఘటన జరిగింది. అతివేగంగా కారణంగా అదుపతప్పి కారు కల్వర్టును ఢీ కొట్టి బోల్తాపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డిపల్లి వాసులుగా గుర్తించారు. మృతుల్లో భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు గంగిరెడ్డి, మాధవీలత, కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. అతివేగంతో తప్పిన కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో బోల్తాపడింది. మృతులు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఇదిలా ఉంటే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు హైవేవై ఐతేపల్లి వద్ద ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హేవేపై వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని డీ కొట్టింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నుంచి తిరుపతి వచ్చిన శ్రీవారి భక్తులు. దర్శనానికి టైమ్ ఉండటంతో మరో గుడిని దర్శించుకునేందుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.

గత ఏడాది ఇదే ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబంలోని ఆరుగురు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబంలో చిన్నపాప తప్ప అందరూ మరణించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టింది. ఆ విషాదం మరవక ముందే అదే ప్రాంతంలో మరో కుటుంబం బలవడం ఆందోళన కలిగిస్తుంది.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...