రుతురాగాలు..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..
రెండు, మూడు రోజుల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు విస్తరణ..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడే స్థిరంగా ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు మీడియాకు వెల్లడించారు. మామూలుగా అయితే ప్రతి ఏటా జూన్ 1వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చేశాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా రుతుపవనాల్లో వేగం పెరిగిన దృష్ట్యా ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక, మరో రెండు, మూడు రోజుల్లో కేరళ మొత్తం విస్తరిస్తాయని, అక్కడి నుండి ఈశాన్య ప్రాంతం వైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఐ. ఎం. డీ వెల్లడించింది. వీటి ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, పోయినేడాది జూన్ 3న నైరుతి రుతుపవనాలు కేరళ ను తాకాయి.

No comments:
Post a Comment