అరటి రైతు కష్టాలు..
అమ్మకాలు లేకపోవడంతో అన్నదాత అవస్థలు..
నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
అరటి పంట వేసిన అన్నదాతకు ప్రతి ఏటా లాభాల పంట పండించేది. కానీ, ఈ ఏడాది అరటి రైతులకు చేదు అనుభవాలను మిగులుస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి లాభాలు వస్తాయని రైతులు ఆశ పడ్డారు. కానీ, తీవ్ర నష్టాలకు గురయ్యారు. అనకాపల్లిలో ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో పంటకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా ఈదురు గాలులతో పంట పూర్తిగా దెబ్బ తింది. పోనీ, దెబ్బ తిన్న గెలలను పక్కన పెట్టి మిగిలిన గెలలను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ ఏడాది అరటి పంట ఆశించినంతగా రైతులకు లాభాలు అందివ్వడం లేదు. నర్సీపట్నం మండలం నుండే అనకాపల్లికి అరటి గెలలు సరఫరా అవుతాయి. ఇక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నర్సీపట్నం వెళ్లాల్సిందే. కానీ, ఇటీవల అకాల వర్షాలకు తక్కువ పంట రావడంతో కొనుగోలుదారులకు కావలసినంత సరుకు ఎగుమతి చేయలేకపోతున్నారు. దీంతో, ఈ గ్రామాల్లో పంట లేదనే ప్రచారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామాలకు కొనుగోలుదారులు రావడం తగ్గుముఖం పట్టారు. రూ.450 నుంచి రూ.250 లకు పడిపోయింది ధర. ఒక్కో గెల 10 నుంచి 18 కిలోల వరకు ఉంటుంది. దీని ధర గతంలో రూ.350 నుంచి రూ.500 వరకు పలికేది. ఈ ఏడాది కనిష్ఠంగా రూ.250 కి పడిపోయింది. సగానికి తక్కువ ధర పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎక్కువ పంట ఉండటంతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి అరటి పంటను తరలించేవారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ పంటకు నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారం కూడా అంతంతమాత్రమే. 33 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట దెబ్బతింటేనే ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ ఏడాది కొంత మోతాదులో పంట దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కల చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు చెప్పిన ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అరటి రైతులు వేడుకుంటున్నారు.

No comments:
Post a Comment