ఐడియా అదుర్స్..
వినూత్నంగా టిఎస్ఆర్టిసి..
రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్లకు ఉచిత ప్రయాణం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
టీఎస్ ఆర్టీసీ కొత్త కొత్త స్కీములతో ప్రయాణికులను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా, తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాప్లకు ప్రయాణికులను ఉచితంగా చేరవేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అల్ఫా హోటల్, రేతిఫైల్, బ్లూసీ హోటల్ ఎదురుగా ఉండే ఉప్పల్ బస్టాప్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రివైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసి అధికారులు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని రైల్వే స్టేషన్లో ఇరువైపులా ఉన్న ప్లాట్ఫామ్స్పై ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులు రైలు దిగగానే వాటి వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో చెబితే బ్యాటరీ వాహనాలు రప్పిస్తారు. అక్కడి నుంచి సమీపంలోని బస్టాప్లో వదిలిపెడతారు. మెట్రో రైలులో వెళ్లాలనుకునేవారు విషయం చెబితే అక్కడ దింపుతారు. త్వరలోనే ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో..
ReplyDelete