Wednesday, 1 June 2022

టెట్ పరీక్షను వాయిదా వేయాలి..

 టెట్ పరీక్షను వాయిదా వేయాలి..




కేయూ క్యాంపస్ లో నిరసన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


తెలంగాణలో ఈ నెల 12న జరగబోయే టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం(బి.యస్.ఫ్),టి.యస్ .డియస్ఏ, పిడియస్ యూ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సంఘం కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న నిర్వహించబోయే టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని, ఎందుకంటే అదే రోజు కేంద్రం నిర్వహించే రైల్వే ఆర్ ఆర్ బి పరీక్ష ఉన్నందున, దాని ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని అన్నారు. అలాగే దానికి తోడు తెలుగు అకాడమీ బుక్స్ కూడా అందుబాటులో లేవని, తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మాధ్యమ పుస్తకాలు కూడా అందుబాటులో లేవన్నారు  యస్ సి మరియు బి సి స్టడీ సర్కిల్ లో ఇప్పటికి సిలబస్ కూడా పూర్తి కాలేదని బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ గ్రూప్ కి చెందటం వల్ల టెట్ రెండవ పేపర్  మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానికి సమయము సరిపోవట్లేదని, టెట్ లో 20 మార్కులు వెయిటేజ్ ఉన్నందున ఆఫ్ మార్క్ తో కూడా జాబ్ కోల్పోయే ప్రమాదం ఉన్నందున టెట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానికి సమయం ఇవ్వాలి. కావున, టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి యస్ డి ఎస్ ఏ రాష్ట్ర కన్వీనర్ క్రాంతి కిరణ్, పి డి యస్ యూ కె యూ కార్యదర్శి కొటేశ్వర్ గౌడ్, నాయకులు శంకర్, అశోక్, అరవింద్, రాజు కుమార్, శ్రీకాంత్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...