మధ్యాహ్నం కల్లా నైరుతి..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్యాహ్నం కల్లా రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా వ్యాప్తి చెందే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సము ద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్లోని మిగి లిన భాగాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఆంధ్ర పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళా ఖాతం ప్రాంతాల్లో ముందుకు సాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

No comments:
Post a Comment