ఆయన ఎవరి పేరు చెపితే వారికే టిక్కెట్టంట..!?
గెలుపు గుర్రాలకే ఈసారి అవకాశం..
పికె టీమ్ సర్వే రిపోర్టే కీలకం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ప్రశాంత్ కిశోర్ @పీకే.. మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త ఈయన. ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. గతంలో జరిగిన పలు ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఐతే, ప్రస్తుతం పీకే టీమ్ తెలంగాణలో టీఆర్ఎస్తో జత కట్టిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రూపొందిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొదన్నది కూడా ప్రశాంత్ కిశోరే డిసైడ్ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుందనేది పబ్లిక్ టాక్.

No comments:
Post a Comment