మళ్లీ పుంజుకుంటున్న కరోనా..!
భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలంటున్న ప్రభుత్వం..
వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కోరలు చాస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గత కొన్నిరోజులుగా 300 లోపే నమోదవుతున్న కరోనా కేసులు, తాజాగా 400 దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు నిర్వహించగా, 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

No comments:
Post a Comment