ఇంటర్ ఫలితాలు విడుదల..
ఈసారి బాలికలదే పైచేయి..
ఫస్టియర్ లో 54, సెకండియర్ లో 61శాతం ఉత్తీర్ణత నమోదు..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష -2022 ఫలితాలు ఈరోజు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఫస్టియర్లో 2,41,591 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత నమోదయింది. రెండో సంవత్సరంలో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది ఈసారి.
ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.., జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా చేశారు.

No comments:
Post a Comment