Thursday, 23 June 2022

బాలుడిని కాటేసి..ఆపై చనిపోయి..

 బాలుడిని కాటేసి..ఆపై చనిపోయి..



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్..

చిన్న పిల్లాడిని కాటేసిన పాము అక్కడే చనిపోయింది..

బీహార్ లో ఘటన..

షాక్ లో కుటుంబసభ్యులు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


 ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ షాకింగ్‌ ఘటన మన దగ్గర కాదు. బీహార్‌ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధోపుర్​ గ్రామానికి చెందిన రోహిత్​ కుశ్వాలాకు అనూజ్​ కుమార్ అనే కొడుకు​ ఉన్నాడు. కాగా, అనూజ్​ తన తల్లితో సహా కుచాయ్​కోట్‌లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్‌ ఇంటి ముందు ఆడుకుంటుడగా.., ఓ పామును బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్‌ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. దీంతో, కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్‌ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా, బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే  పాము చనిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు షాక్ కు గురయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు కొందరు అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో భీభత్సంగా తిరుగుతోంది.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...