విస్తరిస్తున్న బుతుపవనాలు..
క్రమంగా తగ్గుతున్న టెంపరేచర్..
భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
అప్రమత్తంగా ఉండాలని సూచన..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోకి రెండ్రోజుల క్రితమే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు, రేపు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సంబంధిత అధికారులు తెలిపారు. రుతుపవనాలు మరింతగా విస్తరించనున్న క్రమంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సింగపూర్ టౌన్షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

No comments:
Post a Comment