కట్టుకున్న భార్యను డంబెల్స్ తో కొట్టి చంపిన భర్త..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు, భార్యను రెండు ముక్కలుగా చేసి వాటర్ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు. అనిల్, సరోజలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ తరుణంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా పరిస్థితి మారలేదు.ఈ తరుణంలో సరోజా కొన్ని రోజులు నుండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరోవైపు అనిల్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది.
రెహమత్నగర్ సుభాష్ నగర్లో ఈ జంట ఉంటున్న ఇంటికి వచ్చాడు ఆయన. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్కు కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన అనిల్ పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్ డ్రమ్లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది. డంబెల్తో కొట్టి చంపి, ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్ డ్రమ్లో కుక్కేశాడు అనిల్. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

No comments:
Post a Comment