Wednesday, 20 July 2022

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..

 శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..



తెలంగాణ:


 తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ వెబ్ సైట్‌లో పేర్కొంది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయిచనున్నట్లుగా వెల్లడించింది. అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు.. అర్థరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగానే వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగ ప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.


కోవిడ్ కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణ టోకెన్లు నిలిచిపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెల నుంచి మళ్లీ ఈ టోకెన్లను టీటీడీ అందిస్తోంది. అయితే సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉండేవి. జూలై నుంచి ఆన్ లైన్ లో అంగప్రదక్షిణ టికెట్లు అందిస్తున్నారు. అయితే ఇకముందు నేరుగా టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.


ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. రైలు సర్వీసులను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడవనున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. అదేవిధంగా తిరుమల తిరుపతికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...