తిరుమలలో పెరిగిన చలి తీవ్రత..
తెలంగాణ:
తిరుమలలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుంది. అప్పటి నుంచి ఎండనే మాటే లేకుండా పోయింది . అడపాదడపా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. నిన్నటి నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో, తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చాలామంది వృద్ధులు చలికి ఉండలేక తిరుగు ప్రయాణమయ్యారు.

No comments:
Post a Comment