కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..
- ఈనెల 25న కేయూ 22వ స్నాతకోత్సవం..
- పట్టాలు ప్రధానం చేయనున్న గవర్నర్ తమిళిసై..
- 175 మంది పట్టాలు సాధించగా, ఈసారి 49 మందికే ప్రధానం..
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు..
తెలంగాణ:
కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవ వేడుకకు సర్వం సిద్దం చేశారు వర్సిటీ అధికారులు. ఈ నెల 25న 22వ కాన్వొకేషన్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. వర్సిటీ వీసీ రమేశ్ హైదరాబాద్ లో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆహ్వానపత్రం కూడా అందజేశారు. నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ జరగనుండగా, వందల మంది విద్యార్థులు గోల్డ్మెడల్స్, పీహెచ్డీ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కొందరికే పంపిణీ చేస్తామనడం, ఇంకొందరికి పట్టాలు పెండింగ్ లో ఉండడం స్టూడెంట్ల విమర్శలకు కారణమవుతోంది. చివరి సారిగా 2018లో 21వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఆ టైంలో రాష్ట్ర గవర్నర్ హాజరుకాకపోవడంతో అప్పటి వీసీ సాయన్న, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్రాంగోపాలరావు 538 మందికి పీహెచ్డీ పట్టాలు, 276 మందికి గోల్డ్మెడల్స్ అందజేశారు. అప్పటినుంచి మళ్లీ కాన్వొకేషన్ జరపలేదు. కరోనా కారణంగా ఈ ప్రోగ్రాంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టూడెంట్ యూనియన్ల వినతి మేరకు ఈ నెల 25న కాన్వొకేషన్ జరిపేందుకు రెడీ అవుతున్నారు. వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ తో పాటు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్(సెర్బ్) సెక్రటరీ సందీప్ వర్మకు ఆహ్వానం పంపారు.
పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ చీఫ్ గెస్ట్ ల చేతుల మీదుగా అందజేయాల్సి ఉంటుంది. కానీ, యునివర్సిటీ అధికారులు మాత్రం అదంతా ఏమీ లేకుండానే గవర్నర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట గోల్డ్ మెడల్స్ ను కాన్వొకేషన్ ప్రోగ్రామ్ అయ్యాక ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసుకునేలా ప్లాన్ చేశారు. పీహెచ్డీ పట్టాలు 2018, 2019 సంవత్సరాల్లో అవార్డ్ అయిన వారికి మాత్రమే ఇచ్చేలా ఖరారు చేశారు. కానీ, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment