Tuesday, 23 August 2022

కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..

 కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..



  • ఈనెల 25న కేయూ 22వ స్నాతకోత్సవం..
  • పట్టాలు ప్రధానం చేయనున్న గవర్నర్ తమిళిసై..
  • 175 మంది పట్టాలు సాధించగా, ఈసారి 49 మందికే ప్రధానం..
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు..


తెలంగాణ:

కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవ వేడుకకు సర్వం సిద్దం చేశారు వర్సిటీ అధికారులు. ఈ నెల 25న 22వ కాన్వొకేషన్​ నిర్వహించనున్నారు.  ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. వర్సిటీ వీసీ రమేశ్​  హైదరాబాద్​ లో రాష్ట్ర గవర్నర్​ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆహ్వానపత్రం కూడా అందజేశారు. నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ జరగనుండగా, వందల మంది విద్యార్థులు గోల్డ్​మెడల్స్, పీహెచ్​డీ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కొందరికే పంపిణీ చేస్తామనడం, ఇంకొందరికి పట్టాలు పెండింగ్ లో ఉండడం స్టూడెంట్ల విమర్శలకు కారణమవుతోంది. చివరి సారిగా  2018లో 21వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఆ టైంలో రాష్ట్ర గవర్నర్ హాజరుకాకపోవడంతో అప్పటి వీసీ సాయన్న, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్​రాంగోపాలరావు 538 మందికి పీహెచ్​డీ పట్టాలు, 276 మందికి గోల్డ్​మెడల్స్ అందజేశారు. అప్పటినుంచి మళ్లీ కాన్వొకేషన్ జరపలేదు. కరోనా కారణంగా ఈ ప్రోగ్రాంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టూడెంట్ యూనియన్ల వినతి మేరకు ఈ నెల 25న కాన్వొకేషన్ జరిపేందుకు రెడీ అవుతున్నారు. వర్సిటీ చాన్స్​లర్​, రాష్ట్ర గవర్నర్ తో పాటు సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ బోర్డ్​(సెర్బ్) సెక్రటరీ సందీప్​ వర్మకు ఆహ్వానం పంపారు.

పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్​ చీఫ్​ గెస్ట్​ ల చేతుల మీదుగా అందజేయాల్సి ఉంటుంది. కానీ, యునివర్సిటీ అధికారులు మాత్రం అదంతా ఏమీ లేకుండానే గవర్నర్​ ప్రోగ్రామ్​ షెడ్యూల్ ప్రిపేర్​ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట గోల్డ్​ మెడల్స్​ ను కాన్వొకేషన్​ ప్రోగ్రామ్​ అయ్యాక ఎగ్జామినేషన్​ డిపార్ట్​మెంట్ నుంచి కలెక్ట్ చేసుకునేలా ప్లాన్​ చేశారు. పీహెచ్​డీ పట్టాలు 2018, 2019 సంవత్సరాల్లో అవార్డ్ అయిన వారికి మాత్రమే ఇచ్చేలా ఖరారు చేశారు. కానీ, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...