Thursday, 25 August 2022

జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను అధిగమించాలి..

 జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను అధిగమించాలి..

-గవర్నర్ తమిళిసై



తెలంగాణ:

మారుతున్న కాలానికి అనుగుణంగా జీవ‌న విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయ‌ని, అయితే, జీవన విధానంలో మంచిని చేకూర్చే సంప్రదాయ‌క జీవ‌న విధానాన్ని భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఈరోజు వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు.

అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రియేటివ్‌గా ఆలోచించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను ఎదుర్కొంటూ, ముందుకు సాగాలని సూచించారు. ఆన్రైడ్‌ను పక్కకు పెట్టి, ప్రకృతిని ఆస్వాదించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, వ్యక్తిత్వ వికాసం సాధించాలని చెప్పారు. మహిళలు సాధారణ కోర్సులు కాకుండా, వృత్తి పరమైన మెడికల్ కోర్సుల విద్యను అభ్యసించాలని తమిళి సై సూచించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి సాధించిందని, ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని దేశం మరింత ముందుకు పోవాలని, ఇందుకు యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని గవర్నర్ అన్నారు.

కాకతీయ సామ్రాజ్యం పాలనలో మహిళల పాత్ర గణనీయమైనదని, రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని మహిళలు సాధికారిక సాధించడానికి ముందుకుపోవాలని గ‌వ‌ర్నర్ సూచించారు.

అనంతరం ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ మొత్తం 56 మందికి పీహెచ్‎డీ పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...