కొలువుదీరిన గణనాథులు..
ఆనందోత్సాహాల నడుమ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..
వాడవాడనా వెలసిన మండపాలు..
మట్టి విగ్రహాలకే జై కొట్టిన భక్తులు..
తెలంగాణ:
గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజ్ఞాలను తొలగించే వినాయక చవితి వేడుకలను బుధవారం భక్తులు కనుల పండువగా ఆరంభించారు. ఇళ్ల వద్ద మట్టి విగ్రహాలతో వేడుకలు జరుపుకోవడంతో పాటు వీధుల్లో, కూడళ్ళలో, వాడవాడనా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసి గణనాథుడిని కొలువుదీర్చారు భక్తులు.
మరికొన్నిచోట్ల మండపాలను సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాటు చేయడం మరో విశేషం.
ఈసారి భక్తులు పర్యావరణం పై దృష్టి సారించి మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇచ్చారు. భక్తుల్లో అవగాహన పెరగగా పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.


No comments:
Post a Comment