భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి..
తెలంగాణ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం(ఈరోజు) మధ్యాహ్నం ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగు పడటంతో వేర్వేరు చోట్లలో ముగ్గురు రైతులు మృతి చెందారు. రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో వంగ రవి అనే రైతు, చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి వనమ్మ. వీరు పంట చేన్లలో పని చేస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. అదేవిధంగా మల్హర్ మండలంలోని ఛత్రాజ్ పల్లి లో కాటం రఘుపతిరెడ్డి అనే యువకుడు పొలంలో వరి నాటు వేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో, ఆయా గ్రామాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా, ఆకాశంలో నల్లని మబ్బులు గుమిగూడడం, మెరుపులు కనిపించడం, బలమైన ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీచడం వంటివి పిడుగులు పడుటకు సంకేతాలని, అటువంటి సమయంలో ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్తు స్తంభాలు, విడివిడిగా ఉండే చెట్లు, గృహాలు, బహిరంగ ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా సూచించారు.

No comments:
Post a Comment