రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
తెలంగాణ:
లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.., కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.., కొందరు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. లంచం లేనిది పని చెయ్యడం లేదు. చేయి తడపనిదే ఫైల్ పై సంతకం కూడా పెట్టడం లేదు. కాదు కూడదు అంటే.., కాళ్లు అరిగేలా కార్యాలయల చుట్టూ తిప్పుకుంటున్నారు. కాగా, కొందరు బాధితులు ధైర్యం చేసి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో, అవినీతి అధికారులు, లంచావతారులు అడ్డంగా దొరికిపోతున్నారు. వెరసి, వారి బండారం బయటపడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు(శనివారం) కరీంనగర్ జిల్లాలో ఓ పంచాయతీ సెక్రటరీ ఓ వ్యక్తి నుండి అక్షరాల రూ. తొంభై వేలు లంచం రూపంలో తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బావుపేట శివారులో ఓ వ్యక్తి తన భూమిలో రేకుల షెడ్డు నిర్మాణం చేసుకోడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే, సంతకం పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ డిమాండ్ చేశాడు. అయితే, రూ.90 వేలు ఇవ్వడానికి సదరు వ్యక్తి ఒప్పుకున్నారు. కాగా, పథకం ప్రకారం ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

No comments:
Post a Comment