Tuesday, 27 September 2022

తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు..

 తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు..



తెలంగాణ:

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. ఈరోజు(మంగళవారం) నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం సర్వదర్శనం గుండానే, భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. కాగా,

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5:45 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనం పై శ్రీవారు ఊరేగనున్నారు. ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించారు. ఈసారి భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు వేడుకలు జరగనున్నాయి. ఈసారి భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ అంటోంది. సర్వ దర్శనం మినహా మిగిలిన దర్శనాలను రద్దు చేసింది.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...