బావిలోకి దూసుకెళ్లిన కారు..
- రెండు మృతదేహాలు లభ్యం..
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- కారులో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం..
తెలంగాణ:
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. దైవ దర్శనం వెళ్లి వస్తుండగా, ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం శివారులోని ఉన్న ఓ మూలమలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం షరీఫ్ వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కారులో ఉన్నవాళ్లలో కొందరు గాయపడినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు. కేసముద్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి కారును, బావిలో పడిన బాధితులను స్థానికుల సహకారంతో వెలికి తీసే ప్రయత్నాలు చేపట్టారు.










