Wednesday, 25 May 2022

రైతన్నల నిరసన పథం..

 రైతన్నల నిరసన పథం..



  • ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన ఓరుగల్లు రైతన్నలు..
  • ప్రభుత్వం జీవో 80ఏ ని రద్దు చేయాల్సిందే..
  • హన్మకొండ - హైదరాబాద్ హైవేపై బైఠాయింపు..
  • మద్దతు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జీవో 80ఏ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓరుగల్లు రైతన్నలు కదంతొక్కారు. హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ విలువైన భూములను ఇచ్చేదేలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసన కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నిలిచారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. రాజ్యాంగ బద్ధంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉంటే రైతులను అరెస్ట్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నించారు. కాగా, రైతుల నిరసన కార్యక్రమంతో హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...