బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి
![]() |
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొదటి నుండి దూకుడుగా వ్యవహరించిన నటీ బిందు మాధవి విజేతగా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇప్పటివరకు కంటెస్ట్ చేసిన మహిళల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కానీ, బిందు మాధవి ఆ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించింది. చివరి వరకు అఖిల్ సార్ధక్ తీవ్రమైన పోటీని ఇచ్చినప్పటికీ, బిందుమాధవి నినే విజయం వరించింది. దీంతో ట్రోఫీ తో పాటు రూ.40లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.
చివరి వారం బిందుమాధవి, అఖిల్ ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్న రేంజ్ లో ఓట్లు పోలయ్యాయి. తెలుగు తో పాటు తమిళ్ లో ఎక్కువ మంది బిందు మాధవి కి గుర్తింపు ఉండటంతో ఆ ప్రాంతం ఓట్లు విజయానికి దారితీశాయని చెప్పొచ్చు.
అలా ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచింది.
ఈ ట్రోఫీ అందుతున్న అనంతరం బిందు మాధవి మాట్లాడుతూ.. లేట్ బ్లూమర్స్ కు ఈ ట్రోఫీని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే, నేను కూడా ఇదే కోవకు చెందినదాన్నే అని, అందుకే నా లైఫ్ లో అన్నీ ఆలస్యంగా దక్కేవని తెలిపింది. ఆలస్యం అయినా, ఈ ట్రోఫీ ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు ఓట్లేసిన ప్రేక్షకులందరికీ థాంక్స్ చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయింది.

congratulations Bindu garu..
ReplyDelete