Thursday, 16 June 2022

రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2,500..!

 రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2,500..!




రెండో సారి విత్ డ్రా చేస్తే మళ్లీ రూ.2,500..

విషయం తెలుసుకుని ఆ ఏటీఎమ్ కు జనాలు క్యూ..

పోలీసుల రాకతో ఏటీఎమ్ క్లోజ్..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


ఓ వ్య‌క్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు దగ్గరలోని ఏటీఎంకు వెళ్లాడు. కానీ, ఆయ‌న కోరుకున్న న‌గ‌దు కంటే ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు విత్ డ్రా అయింది. దీంతో, ఆశ్చ‌ర్య‌పోయిన స‌ద‌రు వ్య‌క్తి మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ళ్లీ ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు వ‌చ్చింది. ఈ విష‌యం చుట్టు ప్రక్కల జ‌నాల‌కు దవణంలా విస్తరించడంతో, ఆ ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు జనాలు పెద్దఎత్తున చేరుకున్నారు.

మ‌హారాష్ట్ర లోని  నాగ్‌పూర్ జిల్లాలోని ఖ‌ప‌ర్‌ఖేడా ప‌ట్ట‌ణంలోని ఓ ఏటీఎం వ‌ద్ద‌కు న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్య‌క్తి వెళ్లాడు. అత‌నికి రూ. 500 అవ‌స‌రం ఉండ‌టంతో.. అంతే న‌గ‌దు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ రూ. 500ల‌కు బ‌దులుగా రూ. 2,500 వ‌చ్చాయి. మ‌ళ్లీ రూ. 500 విత్ డ్రా చేశాడు. మ‌ళ్లీ రూ.2,500 వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆ వ్య‌క్తి అక్క‌డున్న వారికి చెప్ప‌డంతో క్ష‌ణాల్లోనే వంద‌ల మంది ఏటీఎం వ‌ద్ద గుమిగూడారు. న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. విష‌యం పోలీసుల‌కు చేర‌డంతో హుటాహుటిన ఆ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారుల‌కు స‌మాచారం అందించారు పోలీసులు. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే విత్ డ్రా చేసిన న‌గ‌దు కంటే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...