
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
తెలంగాణ సీఎం కేసిఆర్ మాజీ పీఆర్వో, జర్నలిస్టు, రచయిత గటిక విజయ్ కుమార్ కు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు విశ్వ విద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళల వినియోగం – అధ్యయనం అనే అంశంపై విజయ్ కుమార్ పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నిపుణుల కమిటీ ఈ గ్రంథాన్ని పరిశీలించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ని అవార్డుకు సిఫారసు చేసింది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం(ఈరోజు) జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు అవార్డుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విజయ్ కుమార్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ భట్టు రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన విజయ్ కుమార్ ఏడేళ్ల పాటు తెలంగాణ సీఎం దగ్గర పిఆర్వో గా పనిచేశారు. వివిధ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లలో దాదాపు 25 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.
No comments:
Post a Comment