Saturday, 25 June 2022

ఐటీ జాబ్ వ‌దిలి.. వ్య‌వ‌సాయం చేస్తూ..!

 ఐటీ జాబ్ వ‌దిలి.. వ్య‌వ‌సాయం చేస్తూ..!



తెలంగాణ:

వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకు వచ్చే ఐదెంకల జీతాన్ని తృణపాయం వదులుకుంది తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చిన్మయి. నిత్యం ల్యాప్ టాప్ పై నర్తించిన ఆమె చేతి వేళ్ళకు కలుపు మొక్కలను ఏరే పని చెప్పింది. సేద్యానికి ఆధునికతను జోడించి తన వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది సాయి చిన్మయి. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఏనుగు మోహన్ రెడ్డి, సుజాత దంపతుల కూతురు సాయి చిన్మయి. ఇంజనీరింగ్ చదివిన సాయి చిన్మయికి చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎక్కువ. అయినా, అందరిలా పట్నంలో ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేసేది. నగరంలోని యాంత్రిక జీవితం తనకు నచ్చలేదు. ఎప్పుడు ఊరిపైనే ధ్యాసంత. కరోనా నేపథ్యంలో పని చేస్తున్న సంస్థ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి బాట పట్టింది. సేద్యం మీద మక్కువతో తమ ఊరి శివారులోని వ్యవసాయ కేత్రంలో సాగు పనులను చూసుకుంటున్న తల్లిదండ్రులకు అండగా ఉండాలని భావించింది. మొదట్లో ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు తనని అర్థం చేసుకుని ప్రోత్సహించారు. వారి సపోర్టుతో వ్యవసాయంలోకి దిగిన చిన్మయి, సేద్యానికి ఆధునికతను జోడించి తమ వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది. చిన్మయి మార్కెట్ ను అధ్యయనం చేసి, అన్ని కాలాల్లో గిరాకీ ఉండే పంటలను పండిస్తోంది. మామిటి తోటలో చెట్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో పలు రకాల ఇతర పండ్లు, పూల మొక్కలను సాగు చేస్తోంది. పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తుంది. 



మరొక వైపు కోళ్ళు, కుందేళ్ళు, బాతుల వంటి వాటి పెంపకం కూడా చేపట్టింది. రానున్న రోజుల్లో మరికొన్ని ఇతర పెంపుడు జీవాలను పోషించాలనేది ఆమె ఆకాంక్ష అంటా. వ్యసాయం అంటే చిన్న చూపు చూసి, సాఫ్ట్ వేర్ అంటే గొప్పలాగా భావిస్తున్న యువత ఉన్న ఈ కాలంలో పట్టణం నుంచి పల్లెకు వచ్చి తన వినూ త్న సేద్యంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ మహిళ రైతు.

1 comment:

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...