Tuesday, 28 June 2022

అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం కసరత్తు..

 అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం కసరత్తు..



- తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల..

- త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టే ఛాన్స్..

- ఏపిలో 175 నుండి 225కు, తెలంగాణలో 119 నుండి 153 కు పెరిగే అవకాశం..



తెలంగాణ:


ఎమ్మెల్యే ఆశావాహులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. గత ఎనిమిదేళ్లుగా ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి పెంచే విధంగా.. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 పెంచే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా రిపోర్ట్ వెళ్తే.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముంది. ఐతే, దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. ఇదే అంశంపై మరోసారి కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...