శ్రీవారి సేవలో సినీ నటి
తెలంగాణ:
తిరుమల శ్రీవారిని సినీ నటి రాశీ ఖన్నా ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె.. పక్కా కమర్షియల్ చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

No comments:
Post a Comment