మందు బాబులకు గుడ్ న్యూస్..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
పంజాబ్ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంజాబ్లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగా ఆమోదించింది.
వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది.
పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని తీసుకురావడమే కాదు, కొన్ని నిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడం ద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది.
అంతే కాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. కొన్ని బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు తగ్గనున్నది.

No comments:
Post a Comment