Tuesday, 13 September 2022

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపిడివో..

 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపిడివో..



తెలంగాణ:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒకచోట అవినీతి తిమింగళాలు బయటపడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒకరు పట్టుబడుతున్నా.., లంచాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వెనకాడడం లేదు. అలాంటి ఘటనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జరిగింది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో  విజయ రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్‌, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులు కోసం రూ.1.15 కోట్ల ఎంపీ లాండ్స్‌ నిధులకు సంబంధించి 10 శాతం మండలపరిషత్‌ నిధుల కోసం అనుమతులు ఇవ్వాలని రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి ఎంపీడీవో విజయను కోరారు. అయితే, ఈ పనిచేయడానికి రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎంపీడీవో విజయ డిమాండ్‌ చేశారు. అనుకున్నట్లే ఈనెల 6న రూ.10 వేలను ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ ఇచ్చారు. అనంతరం ఈనెల 10న ఎంపీడీవోపై  ఏసీబీకి  ఉపసర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్‌ చేయగా మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి రూ.40వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంపీ లాండ్స్‌కు సంబంధించిన ఫైల్‌ను సీజ్‌ చేసి ఎంపీడీవోను అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...