తిరుపతి స్టేషన్.. ఇక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్..
నమూనాలు విడుదల చేసిన రైల్వే శాఖ..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్ కు మహర్దశ పట్టనుంది. పనులన్నీ పూర్తి చేశామని, త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లను కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్లలో మన తిరుపతి ఒకటి. ఈ రైల్వే స్టేషన్లను రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వేల ద్వారానే వస్తుంటారు. వచ్చి పోయే భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తుల తాకిడి పెరగడంతో తిరుపతి రైల్వే స్టేషన్ను ప్రపంచస్థాయి తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది.
.jpg)

































